ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు చల్లని కబురు అందింది. ఈ ఏడాది ముందుగానే నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. సాధారణంగా మే 20 నుంచి 25 మధ్య అండమాన్, నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించే రుతుపవనాలు ఈసారి ఈ నెల 13 నాటికే చేరే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.