మరికొద్దిగంటల్లో కేరళను నైరుతి రుతుపవనాలు తాకనున్నట్లు భారత వాతావరణశాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, ఆలప్పుజ, కొట్టాయం, ఎర్నాకుళం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో మరో మూడుగంటల పాటు భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. రుతుపవనాలు తమిళనాడు వైపు కదిలే సూచనలతో, ఆ రాష్ట్రంలోని 15 జిల్లాలకు కూడా భారీ వర్షసూచన చేసింది.