ఆధునిక పేరెంటింగ్లో పిల్లల స్క్రీన్ టైమ్కు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని, ఇది పిల్లల అభివృద్ధిపై ప్రభావం చూపుతున్న నిశ్శబ్ద మహమ్మారిగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా దేశంలో పిల్లల్లో మాట ఆలస్యం (speech delay) కేసులు పెరుగుతుండటానికి అధిక స్క్రీన్ టైమ్ ప్రధాన కారణంగా గుర్తిస్తున్నారు. జీవితంలోని మొదటి మూడు సంవత్సరాలు మెదడు అభివృద్ధికి కీలకం. ఈ సమయంలో తల్లిదండ్రులతో జరిగే సంభాషణలు మాట్లాడే సామర్థ్యానికి పునాది వేస్తాయి. స్క్రీన్ వినియోగం పెరిగితే, పిల్లల మెదడుకు అవసరమైన కమ్యూనికేషన్ ప్రేరణ తగ్గిపోతుంది.