AP: ఈనెల 18న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల డిసెంబరు కోటాను టీటీడీ విడుదల చేయనుంది. వీటి లక్కీడిప్ రిజిస్ట్రేషన్ కోసం ఇదే నెల 20 వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. అంగప్రదక్షిణ టోకెన్లను ఈ నెల నుంచి ఆన్లైన్లో లక్కీడిప్ ద్వారా జారీ చేయనున్నారు. 20వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్లో టికెట్లు మంజూరవుతాయి. 23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ టికెట్లు విడుదలవుతాయి.