
‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ ముగిసింది: అమెరికా
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక ప్రకటన చేశారు. ఇరాన్పై అమెరికా చేపట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ ముగిసినట్లు వెల్లడించారు. ఈ మేరకు హౌస్ ఫారెన్ అఫైర్స్ కమిటీకి ఆయన తెలిపారు. ఆపరేషన్ విజయవంతమైందని, ఇరాన్ రక్షణరంగ పరిశ్రమలను దెబ్బతీశామని వివరించారు. ఇరాన్ సైనిక సామర్థ్యాలను దెబ్బతీసేందుకు ఇకపై అమెరికా దాడులు చేయబోదని అన్నారు.




