పశ్చిమాసిఆయాలో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1,568 పాయింట్లు తగ్గి 78,669 వద్ద, నిఫ్టీ 476 పాయింట్లు క్షీణించి 24,388 దగ్గర ట్రేడవుతోంది. ఇన్ఫీ, BEL, HCL టెక్ షేర్లు లాభాల్లో.. LT, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, M&M, ఇండిగో షేర్లు నష్టాల్లో ఉన్నాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 92 మార్క్ దాటి ఆల్టైం కనిష్ఠాన్ని తాకింది.