TG: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని బీసీ బాలికల గురుకుల హాస్టల్లో ఐదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మహబూబ్నగర్కు చెందిన బాలికను ఆదివారమే తల్లిదండ్రులు హాస్టల్లో చేర్పించారు. హాస్టల్లో ఉండటం బాలికకు ఇష్టంలేకపోయినా బలవంతంగా జాయిన్ చేయించడంతో సోమవారం తెల్లవారుజామున నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.