విద్యార్థుల నిరసనలు అమెరికా కుట్ర వల్లే: మాజీ ప్రధాని షేక్ హసీనా

8643చూసినవారు
విద్యార్థుల నిరసనలు అమెరికా కుట్ర వల్లే: మాజీ ప్రధాని షేక్ హసీనా
బంగ్లాదేశ్‌లో జరిగిన విద్యార్థుల నిరసనలపై మాజీ ప్రధాని షేక్ హసీనా తన మౌనాన్ని వీడారు. "గత సంవత్సరం జూలై-ఆగస్టులో జరిగిన సంఘటనలు అమెరికా కుట్రతో పాకిస్థాన్ నిర్వహించిన ఉగ్రవాద దాడి. నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్, అమెరికన్ల ఆదేశాల మేరకు సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడానికి నన్ను అధికారం నుంచి తొలగించడానికి కుట్ర పన్నారు. ఈ దాడులకు యూనస్ ప్రణాళిక రూపొందించి, నిధులు సమకూర్చి, అమలు చేశారు" అని హసీనా ఆరోపించారు.

సంబంధిత పోస్ట్