పంజాబ్లోని బతిండా జిల్లాలో ఆర్మీ బేస్పై ఆత్మాహుతి దాడి చేయాలని ప్లాన్ చేసిన 19 ఏళ్ల లా స్టూడెంట్ గురుప్రీత్ బాంబు తయారు చేస్తూ పేలుడులో గాయపడ్డాడు. కుడి చేయి కోల్పోయాడు. అతడి తండ్రి జగ్తార్ సింగ్ కూడా రసాయనాలు తొలగించే క్రమంలో గాయపడ్డాడు. తండ్రీకొడుకులు ఎయిమ్స్ బతిండాలో చేరారు. కాగా, సెప్టెంబర్ 11న ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి పోలీసులకు ఈ సమాచారం తెలిసింది. దీంతో గురుప్రీత్పై ఎన్ఐఏ, పంజాబ్ IB దర్యాప్తు ప్రారంభించాయి.