
పరువు హత్య.. 8 నెలల గర్భిణిని గొడ్డలితో నరికి చంపిన మామ(వీడియో)
TG: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలంలోని గెర్రె గ్రామంలో శనివారం పరువు హత్య జరిగింది. కొడుకు కులాంతర వివాహం చేసుకున్నాడని 8 నెలల గర్భిణి అయిన కోడలిని మామ గొడ్డలితో నరికి చంపాడు. గత ఏడాది శివార్ల శేఖర్, తలండి రాణి ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం చెప్పారు. అయినప్పటికీ ప్రేమించిన యువతినే శేఖర్ పెళ్లి చేసుకున్నాడు. అయితే తన పరువుపోయిందని రగిలిపోతున్న తండ్రి శివార్ల సత్తయ్య కోడలు రాణిని శనివారం నరికి హత్య చేశాడు.




