సూపర్స్టార్ రజినీకాంత్ రిషికేశ్ ఆధ్యాత్మిక పర్యటనలో పాల్గొంటూ సింపుల్ లుక్తో నెటిజన్లను ఆకట్టుకున్నారు. తెల్ల చొక్కా, పంచెతో సాధారణ వేషధారణలో గంగా హారతిలో పాల్గొని, రోడ్డు పక్కన ఆకుల పళ్ళెంలో భోజనం చేశారు. ఎటువంటి ఆడంబరంలేకుండా రాయిపై కూర్చొని భోజనం చేస్తున్న ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఆయన వినయానికి అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.