సినిమా టికెట్ల ధరల పెంపుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సామాన్య ప్రజలు సినిమా చూడటానికి రూ.2 వేలు ఖర్చు చేయాల్సి వస్తోందని, వాటర్ బాటిల్ కు రూ.100 వసూలు చేస్తున్నారని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టికెట్ ధరలను రూ.200కు పరిమితం చేయాలని, ప్రతి టికెట్ రికార్డులను మెయింటైన్ చేయాలని మల్టీప్లెక్స్ ఆపరేటర్లను ఆదేశించింది. అగ్రహీరోల, భారీ బడ్జెట్ సినిమాల విడుదల సందర్భంగా టికెట్ రేట్లు పెంచుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేస్తున్న జీఓలపై సుప్రీం ఆదేశాలు షాక్ ఇచ్చాయి.