2017లో ఏడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో మరణశిక్ష ఎదుర్కొంటున్న దశ్వంత్ను సుప్రీంకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. దిగువ కోర్టు విచారణ ఏకపక్షమని, పోలీసులు అతడిని బలిపశువుగా చేశారని వ్యాఖ్యానించింది. నిందితుడికి తనను తాను రక్షించుకునే హక్కు కల్పించలేదని తెలిపింది. ప్రాసిక్యూషన్ కీలక ఆధారాలు నిరూపించలేకపోయిందని పేర్కొంటూ, దిగువ కోర్టు, మద్రాస్ హైకోర్టు తీర్పులను రద్దు చేసింది.