తమిళనాడులో జరిగిన కూవాగం ఉత్సవాల్లో కోయంబత్తూరుకు చెందిన సూర్య కుట్టి ‘మిస్ కూవాగం 2026’గా నిలిచి గుర్తింపు పొందింది. ట్రాన్స్జెండర్ల అతిపెద్ద సాంస్కృతిక వేడుకగా పేరొందిన కూవాగం ఫెస్టివల్లో ఈ అందాల పోటీలు నిర్వహించగా, దేశ విదేశాల నుంచి సుమారు 40 మంది పాల్గొన్నారు. ర్యాంప్ వాక్, టాలెంట్, ఈవినింగ్ గౌన్ రౌండ్లలో సూర్య కుట్టి అద్భుత ప్రదర్శన చేసి విజేతగా నిలిచింది. మలేషియాకు చెందిన నిషా ఫస్ట్ రన్నరప్గా, పుదుచ్చేరికి చెందిన అనన్య సెకండ్ రన్నరప్గా నిలిచారు.