యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో జరిగిన లక్కీ డ్రాలో 10 నెలల చిన్నారి హన్సిక రూ.500కే రూ.16 లక్షల విలువైన 66 గజాల ప్లాటును గెలుచుకుంది. రామ్ బ్రహ్మచారి నిర్వహించిన ఈ డ్రాలో శంకర్ అనే వ్యక్తి తన కుమార్తె హన్సిక పేరుతో తీసిన 4 కూపన్లలో 2307 నంబరుతో ఈ బహుమతి దక్కింది. రూ.500కే ఇంత పెద్ద బహుమతి రావడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.