పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటు పడాలని హుజూర్ నగర్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం హుజూర్ నగర్ లో రంగస్థల సంక్షేమ సంఘం అధ్యక్షుడు దొంతగాని సత్యనారాయణ కళా బృంద ఆధ్వర్యం లో నిర్వహించిన పర్యావరణ పరిరక్షణకు నృత్య నాటిక కళారూపాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కళాకారులు దొంతగాని సత్యనారాయణ, జొన్నలగడ్డ గోవిందు, ములకలపల్లి శ్రీను ఉన్నారు.