హైదరాబాదులో జూలై 17న రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో జరిగే రజకుల మహా ధర్నాకు రజకులు తరలిరావాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ పిలుపునిచ్చారు. బుధవారం హుజూర్నగర్ లో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ కోరుట్ల శ్రీనివాస్, సత్తు శ్రీనివాస్, ఇందిరాల నరసయ్య, అంజి, రాంబాబు, ఉపేందర్, పిచ్చయ్య ఉన్నారు.