ఆగస్ట్ 1 న హుజూర్ నగర్ లో జరిగే వికలాంగుల, చేయూత ఆసరా పెన్షన్ల జిల్లా సభను జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్ సూర్యాపేట జిల్లా ఇంచార్జీ బచ్చలకూరి వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం హుజూర్ నగర్ నియోజకవర్గం, గరిడేపల్లి, రామచంద్రపురం గ్రామాల్లో ఆసరా పెన్షన్ల జిల్లా సభ ప్రచార కార్యక్రమంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చింత వినయ్ బాబు, ఏపూరు రాజు, ప్రసాద్ ఉన్నారు.