సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని కొత్త దొనబండ తండాకు చెందిన సర్పంచ్ బానోతు అరుణా, దేశ్ పాండు నాయక్ దంపతుల కుమార్తె లోహిత (మహీ) పదవ తరగతి పరీక్షల్లో 600కు 578 మార్కులు సాధించి మండలంలోనే మొదటి ర్యాంకు సాధించింది. ఆమె ప్రతిభపై గ్రామ ప్రజలు, బంధువులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. లోహిత కృషి, పట్టుదల ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తుందని పలువురు పేర్కొన్నారు.