
పాలవరం తాగునీటి సమస్య: బీజేపీ నాయకుడి ఆరోపణలు
అనంతగిరి మండలం పాలవరం గ్రామంలోని ఐదో వార్డులో వారం రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని శుక్రవారం బీజేపీ నాయకుడు మట్టపల్లి సిద్ధయ్య ఆరోపించారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు లేవని విమర్శించారు. నీటి కోసం ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, చిన్నారులు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, తక్షణమే నీటి సరఫరా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పరిష్కరించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.







































