కోదాడ పరిధి బాలాజీ నగర్ 7వ వార్డు నుండి బిఆర్ఎస్ అభ్యర్థిగా హనుమా నాయక్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తన అనుచరులతో కలిసి ర్యాలీగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని, ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.