కోదాడలో శుక్రవారం జన విజ్ఞాన వేదిక చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ గోడ పత్రికలను ఆవిష్కరించారు. విద్యార్థుల్లో శాస్త్రీయ పరిజ్ఞానం పెంపొందించేందుకు వేదిక చేస్తున్న కృషిని ప్రముఖ వైద్యులు జే సుబ్బారావు అభినందించారు. విద్యార్థులు ఈ పరీక్షలో పాల్గొని తమ ప్రతిభను కనబరచాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు జాఫర్, జిల్లా ఉపాధ్యక్షుడు బడుగుల సైదులు పాల్గొన్నారు.