రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కోర్టులో పనిచేస్తున్న యువ మహిళా న్యాయవాది స్వప్న దారుణ హత్యను నిరసిస్తూ, గురువారం కోదాడ కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఉయ్యాల నర్సయ్యతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు. ఈ సంఘటన న్యాయవాద వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టించింది.