మోతె మండలం మామిళ్ళగూడెం హై స్కూల్ విద్యార్థిని భానోదయ, బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించింది. ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామ నర్సయ్య తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, పాఠశాల చైర్మన్, గ్రామ పెద్దలు భానోదయను అభినందించారు. తల్లిదండ్రులు ఆనందోత్సవాలు వ్యక్తం చేశారు.