శనివారం కోదాడ మండలం తొగర్రాయిలో జరిగిన సమ్మక్క సారలమ్మ జాతరలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తం పాల్గొన్నారు. ఆమె అమ్మవార్లకు బోనం ఎత్తి కానుకలు సమర్పించి, పూజలు చేశారు. వనదేవతల ఆశీస్సులు ప్రజలకు కలగాలని, గ్రామస్తులందరికీ శుభం జరగాలని ఆమె ఆకాంక్షించారు. గ్రామ దేవతలను ఆరాధించడం అనాదిగా వస్తున్న ఆచారమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లిక్కి గురవమ్మ, స్థానిక నాయకులు పాల్గొన్నారు.