తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాజకీయ కమిటీ వైస్ చైర్మన్గా సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన సీనియర్ నాయకుడు ఓరుగంటి ప్రభాకర్ నియమితులయ్యారు. హైదరాబాద్లోని వాసవి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ తనపై నమ్మకంతో బాధ్యతాయుతమైన పదవిని అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడికి, సీనియర్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.