కోదాడ రూరల్ ఎస్సై గోపాల్ రెడ్డి తల్లిదండ్రులకు, యువతకు కీలక సూచనలు జారీ చేశారు. పిల్లలను నియంత్రణ లేకుండా వదిలేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాత్రి 10 గంటల తర్వాత గుంపులుగా తిరుగుతూ అల్లర్లు సృష్టించే యువతపై కఠిన చర్యలు తీసుకుంటామని, పోలీసులకు పట్టుబడితే జైలుశిక్ష తప్పదని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలపై పర్యవేక్షణ పెంచాలని, వారి ప్రవర్తనపై దృష్టి పెట్టాలని సూచించారు.