కోదాడ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో క్రీడలు సాధన చేసే క్రీడాకారులకు, వాకర్స్కు స్థానికులు షేక్ బాషు మియా కూల్ మినరల్ వాటర్ సౌకర్యం కల్పించారు. ప్రతిరోజూ క్రీడాకారులకు సరిపడా మంచి నీరు అందిస్తానని ఆయన తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న బాషు మియాను అభినందించారు. ఈ కార్యక్రమంలో పీఈటీ కళ్యాణ్, భద్రం, బాజాన్ పాల్గొన్నారు.