కోదాడ పట్టణ పరిధిలోని బాలాజీ నగర్ గౌడోన్లో గత కొన్ని సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్న మంచి నీటి బోరు వెల్ను ఆవార్డ్ కౌన్సిలర్ ఉదయశ్రీ హరిప్రసాద్ మరమ్మత్తు చేయించి తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చారు. గౌడోన్లో నీటి వసతి లేకపోవడంతో కార్మికులు తమ సమస్యను కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్లగా, ఆమె స్పందించి మరమ్మత్తులు చేయించారు. నీటి వసతి కల్పించినందుకు కార్మికులు కౌన్సిలర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.