
బాణాసంచా కేంద్రంలో పేలుడు.. మంటల్లో చిక్కుకున్న కార్మికులు
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మంటలు ఎగిసిపడుతుండటంతో పలువురు కార్మికులు లోపల చిక్కుకున్నారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పేలుడుకు గల కారణాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.




