కోదాడ మండలం గుడిబండ గ్రామంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా, బీఎల్వోలు పంపిణీ చేసిన ఓటరు నమోదు, సవరణ ఫారాలను బీఎల్ఏలు ఓటర్ల ఇళ్లకు వెళ్లి నింపుతున్నారు. ఓటర్లకు అవసరమైన వివరాలను తెలియజేస్తూ, ఫారాలను సక్రమంగా పూర్తి చేయడంలో వారు సహకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తుమాటి నాగిరెడ్డి, కోదాడ పీఏసీఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాసరెడ్డి, పులి వెంకటేశ్వర్లు, కుక్కడపు నాగరాజు, ఎరగని నాగ శేషు గౌడ్, పులి రాజా పాల్గొన్నారు. ఖాజా నగర్ వాసులు కూడా ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు అవగాహన కల్పిస్తూ ఫారాల నమోదు ప్రక్రియను విజయవంతం చేయడానికి సహకరించారు.