ఆత్మకూరు ఎస్ మండలం నసీం పేట గ్రామంలో గుండపునేని రవీందర్ రావు ఇంట్లో మల, మూత్ర ద్వారాలు, జననావయాలు లేకుండా జన్మించిన ఆడ దూడకు కోదాడ పశు వైద్యశాల డాక్టర్ పెంటయ్య కృత్రిమ అవయవాలు ఏర్పాటు చేసి ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటన పశు వైద్య రంగంలో ఒక అరుదైన వైద్య విజయంగా నిలిచింది.