నిందితులకు శిక్ష పడే వరకు పోరాటం ఆగదు.. మంద కృష్ణ

2చూసినవారు
నిందితులకు శిక్ష పడే వరకు పోరాటం ఆగదు.. మంద కృష్ణ
కోదాడ పట్టణ గాంధీనగర్‌లో MRPS ఆధ్వర్యంలో కర్ల రాజేష్ సంతాప సభ జరిగింది. ఏపురి రాజు మాదిగ అధ్యక్షతన జరిగిన ఈ సభకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కర్ల రాజేష్ అమాయకుడని, అక్రమ నిర్బంధంలో చిత్రహింసల వల్లే మృతి చెందాడని మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. నిందితులకు శిక్ష పడే వరకు పోరాటం కొనసాగుతుందని, ఈ నెల 17న సూర్యాపేటలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్