సూర్యాపేటలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ జిల్లా కమిటీ పునర్నిర్మాణంపై సమావేశం జరిగింది. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జరిగిన ఈ సమావేశంలో, మాదిగ దండోరా ఉద్యమాన్ని బలోపేతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. నియోజకవర్గ మండలాల్లో మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకు సదస్సులు నిర్వహించాలని, ఏప్రిల్ 7న ముంబైలో జరిగే జాతీయ సమావేశానికి సిద్ధం కావాలని నిర్ణయించారు.