ఆదివారం చివ్వేంల మండలంలోని బీబిగూడెం ప్రాథమిక పాఠశాల హెచ్ఎం శకుంతల ఉద్యోగ విరమణ అభినందన సభలో మండల విద్యాధికారి కళారాణీ మాట్లాడుతూ, విద్యారంగ అభివృద్ధిలో శకుంతల కృషి అభినందనీయమని అన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం కూడా ప్రభుత్వ విద్యారంగ బలోపేతంలో భాగస్వాములు కావాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో TPUS జిల్లా ప్రధాన కార్యదర్శి యామా రమేశ్, ఇంఛార్జి హెచ్ఎం జయశ్రీ, పద్మ, అనిల్ పాల్గొన్నారు.