చంద్రబాబుకు బిజినెస్ బెస్ట్ ఫార్మర్ అవార్డు: తిరునగరి జ్యోత్స్న అభినందన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎకనామిక్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా సంస్థ బిజినెస్ బెస్ట్ ఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ప్రధానం చేయడం పట్ల జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న శ్రీధర్ అభినందనలు తెలిపారు. కోదాడలో ఆదివారం జరిగిన తెలుగుదేశం సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో ముత్తినేని సైదేశ్వర రావు, కట్టా సతీష్, గుండు నాగేశ్వరరావు, వనపర్తి నాగేశ్వరరావు, హరినాథ్, వెంగళరావు, శ్రీ వాత్సవ్ తదితరులు పాల్గొన్నారు.
