మద్దిరాల మండలం రెడ్డిగూడెం గ్రామంలో రైతులు వరి కొయ్యలకు నిప్పు పెట్టడంతో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ మంటలు చుట్టుపక్కల పొలాలకు వ్యాపించడంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ప్రభుత్వం, అధికారులు, పోలీసులు ఎన్నిసార్లు విన్నవించినా రైతులు వరి కొయ్యలకు నిప్పు అంటిస్తున్నారని స్థానికులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.