సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ భారీ నిరసన బైక్ ర్యాలీ నిర్వహించింది. మాజీ సీఎం కేసీఆర్ కు సీట్ నోటీసులు పంపించి, విచారణకు హాజరు కావాలని ఆదేశించడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నిరసన ర్యాలీలకు పిలుపునిచ్చింది. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఈ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ను ఇబ్బందులు పెట్టాలని చూస్తుందని ఆయన అన్నారు.