సూర్యాపేట జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ తుంగతుర్తి ఆధ్వర్యంలో శనివారం ధాన్యం కొనుగోలు ఎం.ఎస్.పి పరికరాలు, టార్పాలిన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న ముఖ్య అతిథులుగా హాజరై ఐకెపి కేంద్రాల నిర్వాహకులకు వీటిని అందజేశారు. తుంగతుర్తి, మద్దిరాల, నూతనకల్ డైరెక్టర్లు, ఐకెపి నిర్వాహకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.