సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం సంగెం గ్రామం ముంథా తుపాను ధాటికి జలదిగ్బంధంలో చిక్కుకుంది. గ్రామం రెండు వైపులా భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. సంగెం గ్రామానికి సమీపంలో ఉద్ధృతంగా అలుగు ప్రవాహం కొనసాగుతోంది. అన్నారం నుంచి వెళ్లేందుకు సైతం వీలు కావడం లేదు. అక్కడి కుంట నిండి రహదారి మొత్తం నీట మునగడంతో రాకపోకలు నిలిచిపోయాయి.