యాదగిరిగుట్ట: యాదాద్రి ఆలయంలో స్వామివారికి నిత్య పూజలు
By Velugu Saidulu 1చూసినవారుయాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో శుక్రవారం స్వయంభువులైన పంచ నారసింహులకు నిత్యపూజలతో పాటు అమ్మవారిని ఆరాధిస్తూ ప్రత్యేక క్రతువులు ఆలయ ఆచారంగా కొనసాగించారు. వేకువ జామున సుప్రభాతంతో మూల విరాట్లను మేల్కొలిపి, హారతి నివేదనలు సమర్పించారు. అనంతరం పాలతో నిజాభిషేకం, తులసీదళాలతో అర్చన, సువర్ణ పుష్పాలతో దర్శనమూర్తులను అర్చించారు.