నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి పేరును జెన్-జడ్ నిరసనకారులు ప్రతిపాదించారు. కాసేపట్లో నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనిపై జెన్-జడ్, ఆర్మీ, అధ్యక్షుడి మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. నేపాల్లో నెలకొన్న అస్థిర పరిస్థితులను పరిష్కరించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సుశీల నేపాల్ మొదటి మహిళా న్యాయమూర్తి. భారత్తో ఆమెకు ప్రత్యేక అనుబంధం ఉంది.