AP: విశాఖలో దారుణ ఘటన వెలుగు చూసింది. శుక్రవారం కూర్మన్నపాలెంలో అల్లూరి జిల్లాకు చెందిన విజయ్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. వాషింగ్ సెంటర్లో పనిచేస్తున్న విజయ్, తన ప్రియురాలిని రూమ్కు పిలిపించాడు. ఆమె ఇద్దరు మహిళలతో కలిసి అక్కడికి వచ్చింది. యజమాని గది ఖాళీ చేయమనడంతో మహిళలు వెళ్లిపోయారు. ఆ సాయంత్రం రూమ్లో విజయ్ మృతి చెంది ఉన్నాడు. ఆ మహిళల ఫోన్లు కలవడం లేదు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.