ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ, తన ప్రీమియం మెంబర్షిప్ 'వన్' నుంచి చేసే ఆర్డర్లపై నవంబర్ 25 నుంచి కొత్త ఛార్జీలను అమలు చేయనుంది. ఎంపిక చేసిన రెస్టారెంట్లకు ఈ రుసుము వర్తిస్తుంది. ఆర్డర్ మొత్తంపై ఆధారపడి ఒక్కో ఆర్డర్పై రూ.2-5 వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ కొత్త రుసుము, ప్రస్తుతం ఉన్న 17-25% బేస్ కమిషన్, ఇతర ఛార్జీలకు అదనంగా ఉంటుంది. గతంలో స్విగ్గీ వన్ వినియోగదారులకు ఈ విషయంలో మినహాయింపు ఉండేది.