టీ20 ప్రపంచకప్లో భాగంగా యూఏఈతో జరిగిన మ్యాచ్లో అఫ్గానిస్థాన్ విజయం సాధించింది. 161 పరుగుల లక్ష్యాన్ని అఫ్గాన్ 5 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో ఛేదించింది. ఇబ్రహీం(53) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఒమర్జాయ్(40*), రసూలీ(33) రాణించారు. యూఏఈ బౌలర్లలో అర్ఫాన్, జునైద్ రెండేసి వికెట్లు, జావాదుల్లా ఒక వికెట్ తీశారు. తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 160/9 స్కోర్ చేసింది.