తమిళనాడులో టాటా మోటార్స్‌ కొత్త ప్లాంట్‌ ప్రారంభం

21చూసినవారు
తమిళనాడులో టాటా మోటార్స్‌ కొత్త ప్లాంట్‌ ప్రారంభం
ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ ప్యాసింజర్‌ వెహికల్స్‌ (TMPV) లిమిటెడ్‌ తమిళనాడులోని రాణిపేట జిల్లా పాణపక్కంలో కొత్త తయారీ కేంద్రాన్ని సోమవారం ప్రారంభించింది. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌, టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాబోయే 5-7 ఏళ్లలో ఈ ప్లాంట్‌ ద్వారా 2.5 లక్షల వాహనాల ఉత్పత్తి సామర్థ్యాన్ని అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు, ఈ ప్లాంట్‌పై రూ.9 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు టాటా మోటార్స్‌ వెల్లడించింది.

సంబంధిత పోస్ట్