ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో విశ్వేశ్వరయ్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో ఘోరం జరిగింది. ఓ బి-ఫార్మసీ విద్యార్థిని తనపై లాల్ట్ రామ్ అనే ఫ్యాకల్టీ సభ్యుడు లైంగిక వేధింపులకు.. దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. రక్షణగా ఉండాల్సిన విద్యాసంస్థలోనే ఇలాంటి అమానుషం జరగడం తీవ్ర కలకలం రేపింది. బాధితురాలు ధైర్యంగా పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాధిత విద్యార్థిని సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.