పిల్లలతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్

47చూసినవారు
AP: శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లిలోని బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న ఉపాధ్యాయురాలిపై వేటు పడింది. కుర్చీలో కూర్చుని సెల్ ఫోన్ మాట్లాడుతూ, విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న ఘటన వీడియో వైరల్ కావడంతో విద్యాశాఖ స్పందించింది. ఈ ఘటనపై చర్యలు తీసుకుంటూ ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేశారు. నెటిజన్లు ఉపాధ్యాయురాలి తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు.

సంబంధిత పోస్ట్