ఆసియా కప్లో భాగంగా అబుదాబి వేదికగా శుక్రవారం ఒమన్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా ఐదు వికెట్లు కోల్పోయింది. హిట్టర్ శివమ్ దూబే కేవలం 5 పరుగులకు ఔట్ అయ్యారు. అమీర్ కలీం బౌలింగ్లో 13.2 బంతికి జతీందర్ సింగ్కు క్యాచ్ ఇచ్చి శివమ్ దూబే (5) పెవిలియన్ చేరారు. దీంతో 14 ఓవర్లకు భారత్ స్కోర్ 134/5గా ఉంది. క్రీజులో తిలక్ వర్మ (3), సంజు శాంసన్ (46) ఉన్నారు.