టీమ్ఇండియా అక్టోబర్ 22 నుంచి డిసెంబర్ 1 వరకు న్యూజిలాండ్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్లు ఆడనుంది. క్రైస్ట్చర్చ్లో అక్టోబర్ 22న తొలి
టీ20 మ్యాచ్తో సిరీస్ ప్రారంభం కానుంది. నవంబర్ 4 నుంచి వన్డేలు, అదే నెల 19 నుంచి టెస్టులు ఆడతారు.
భారత్, న్యూజిలాండ్ మధ్య క్రీడా సంబంధాలకు వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ సిరీస్ ప్రాధాన్యం సంతరించుకుంది.